సుల్తాన్బజార్, సెప్టెంబర్ 21: మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ముఖ్యమని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నాడు. గురువారం కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన షటిల్, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులను గోపీచంద్ ప్రారంభించాడు. కళాశాలలో ఫ్రెషర్స్డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ..
‘క్రీడల ద్వారా మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్య విద్యార్థులు పని ఒత్తిడిని అధిగమించాలంటే క్రీడల్లో పాల్గనడమే మంచిది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళారెడ్డి, ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, డాక్టర్ జయ, డాక్టర్ కిరణ్మయి, జానకి, పద్మిని, ఉపేందర్ రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.