హైదరాబాద్, నవంబర్28 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 1000 మంది దివ్యాంగ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననుండగా, డిసెంబర్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బీ శైలజ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఎల్బీ స్టేడియంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ పోటీల్లో దివ్యాంగ ప్లేయర్లు ఉత్సాహంగా పాల్గొనాలని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి పిలుపునిచ్చారు