హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోల్ఫ్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థి మాల అనూష అదరగొట్టింది. పాల్గొన్న తొలి టోర్నీలోనే అద్భుత ప్రదర్శన కనబరిచి రన్నరప్గా నిలిచింది. ఏపీలోని విశాఖపట్నం వేదికగా జరిగిన సౌత్జోన్ జూనియర్ గోల్ఫ్ చాంపియన్షిప్లో తెలంగాణ గురుకులాల గోల్ఫ్ అకాడమీకి చెందిన అనూష వారెవ్వా అనిపించింది. ఈ యువ గోల్ఫర్తో పాటు కోచ్ భాస్కర్ను గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్ రాస్ అభినందించారు.