ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): ముక్కోణపు టోర్నీలో పరాజయం ఎరుగకుండా ఫైనల్ చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు.. తుదిమెట్టుపై తడబడింది. లీగ్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన హర్మన్ప్రీత్ బృందం చివరి మ్యాచ్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గురువారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గి ట్రోఫీ చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది.
హర్లీన్ డియోల్ (46) టాప్ స్కోరర్. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (0) విఫలం కాగా.. జెమీమా రోడ్రిగ్స్ (11), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (21), దీప్తి శర్మ (16 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. ట్రయాన్ (32 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో జట్టును గెలిపించింది. దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకుంది.