న్యూఢిల్లీ: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత్కు విచ్చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. కొవిడ్ పరీక్షలు పూర్తి చేసుకొని శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 9న మొదటి మ్యాచ్ జరుగనుండగా.. భారత గడ్డపై స్పిన్తోనే టీమ్ఇండియాను ఇబ్బంది పెట్టాలనుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. తొలి రోజు తబ్రేజ్ శంసీ, కేశవ్ మహరాజ్, వైన్ పార్నెల్ నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. హెడ్ కోచ్ మార్క్ బౌచర్ పర్యవేక్షణలో డసెన్, డికాక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించారు. ‘జట్టు సభ్యులందరికీ కరోనా టెస్టుల్లో నెగిటివ్ అని తేలింది. మొన్నటి వరకు ఐపీఎల్లో ఆడిన ఆటగాళ్లు మాత్రం ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నారు’ అని దక్షిణాఫ్రికా జట్టు అధికారి తెలిపారు. గుజరాత్ ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్ మాల్దీవుల్లో సేదతీరుతున్నాడు. త్వరలోనే అతడు జట్టుతో చేరుతాడని సఫారీ జట్టు యాజమాన్యం పేర్కొంది.