రెండో టెస్టులో 332 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు
న్యూఢిల్లీ: స్పిన్నర్ కేశవ్ మహరాజ్ విశ్వరూపం ప్రదర్శించడంతో బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 322 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. 413 పరుగుల భారీ లక్ష్యఛేదనలో.. ఓవర్నైట్ స్కోరు 27/3తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా.. 80 పరుగులకే ఆలౌటైంది. కేశవ్ (7/40), హర్మెర్ (3/34) ధాటికి.. లిటన్ దాస్ (27), మెహదీ హసన్ (20), తమీమ్ ఇక్బాల్ (13) మినహా తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. నాలుగో రోజు ఆట ముగించేందుకు సఫారీ స్పిన్నర్లకు కేవలం 14 ఓవర్లే అవసరమయ్యాయి. సిరీస్లో 108 పరుగులతో పాటు 16 వికెట్లు పడగొట్టిన కేశవ్ మహరాజ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.