పోచెఫ్స్ట్రోమ్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత్-‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. సుదీర్ఘ ఫార్మాట్కు తగిన సన్నద్ధత కోసం ఈ మ్యాచ్ నిర్వహించగా.. దక్షిణాఫ్రికా -‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులు చేసింది.
ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్-‘ఎ’ 417 రన్స్ కొట్టింది. ప్రదోశ్ రంజన్ (163; 23 ఫోర్లు, ఒక సిక్సర్) భారీ సెంచరీ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ (68), శార్దూల్ ఠాకూర్ (76; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 152/2తో నలిచింది. యాసీన్ వల్లి (72 నాటౌట్), జీన్ డు ప్లెసిస్ (50 నాటౌట్) రాణించారు.