కంటోన్మెంట్, జూన్ 23 : సీసీ కెమెరాలు.. భద్రతకు రక్షణ కవచంలా పనిచేస్తాయని నగర సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 44 సీసీ కెమెరాలను బుధవారం కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సాయన్న, నార్త్జోన్ డీసీపీ కళ్మేశ్వర్ సింగెన్వార్, సీఐ పరావస్తు మధుకర్ స్వామితో కలిసి సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాలు నిఘా నేత్రంలో ఉన్నాయని తెలిపారు. ప్రతీ దృశ్యం సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో ఎలాంటి ఘటనలు జరిగినా నిందితులు వెంటనే దొరుకుతున్నట్లు చెప్పారు. దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే నగరంలో సుమారు 3.80లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. కార్యాలయాలు, వీధుల్లోనే కాకుండా ప్రతి ఇంట్లోనూ వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకొని నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు. అంతకుముందు కమ్యూనిటీ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న పలువురికి ఎమ్మెల్యే సాయన్న, సీపీ అంజనీకుమార్లు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీలు రమేశ్, వెంకటరమణ, కార్ఖానా సీఐ మధుకర్స్వామి, డీఐ నేతాజీ, ఎస్సైలు అవినాశ్బాబు, నారాయణ, నర్సింహులు, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నివేదిత, భాస్కర్తో పాటు పోలీస్ సిబ్బంది భార్గవి, ప్రీతి, శంకర్నాయక్, యాదగిరి, ఈశ్వర్, రాకేశ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గతేడాది నుంచి కరోనా సమయంలో కార్ఖానా పోలీస్ సిబ్బందికి ఆహారాన్ని అందించిన శంకర్ ఇటీవల కరోనా భారిన పడి మృతి చెందారు. ఈ క్రమంలో కార్ఖానా పోలీస్ సిబ్బంది శంకర్ కుటుంబానికి రూ. 50వేల ఆర్థిక సహాయాన్ని నగర సీపీ అంజనీకుమార్తో అందించారు. ఆదే విధంగా కార్ఖానలోని మూవర్స్ అండ్ ప్యాకర్స్ అధినేత కుమార్ అగర్వాల్ సైతం శంకర్ కుటుంబ సభ్యులకు తన వంతుగా రూ.25వేల నగదును అందజేశారు.
కార్ఖానా పోలీస్ స్టేషన్ భవనానికి సంబంధించి ప్రహారీ నిర్మాణ పనులకు సీపీతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. సుమారు రూ.15లక్షల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
కార్ఖానా నూతన పోలీస్ స్టేషన్ భవనం త్వరగా పూర్తి కావడానికి సీఐ పరావస్తు మధుకర్స్వామి ఎంతో చొరవ చూపారని సీపీ, ఎమ్మెల్యే ప్రశంసించారు. నగరంలోనే మోడల్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దడంలో కీలక ప్రాత పోషించారని గుర్తు చేశారు. ఆదే విధంగా కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, రక్తదాన శిబిరాలు, హరితహారం, జాబ్ కనెక్ట్, కరోనా వేళా సేవా కార్యక్రమాలు వంటివి చేపట్టి ఆదర్శంగా నిలిచారన్నారు.