Saurav Ganguli | విరాట్ కోహ్లీని సంప్రదించాకే టీమ్ ఇండియా వన్డే జట్టు సారధిగా రోహిత్ శర్మను నియమించామని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ చెప్పారు. కోహ్లీతో సెలెక్టర్లు చర్చించాకే తాము సమిష్ఠి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ కొనసాగుతాడన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే టెస్ట్ సిరీస్కు అజింక్యా రహానే స్థానే రోహిత్ శర్మను వైస్కెప్టెన్గా బీసీసీఐ నియమించింది.
టీ-20 ఫార్మాట్ జట్టు సారధిగా తప్పుకుంటానని కోహ్లీ అన్నప్పుడు ఆ ఆలోచన విరమించుకోవాలని బీసీసీఐ కోరినా ఆయన అంగీకరించలేదని గంగూలీ తెలిపారు. ఇంతకుముందు టీ-20, వన్డే జట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమించిన సంప్రదాయం టీం ఇండియా చరిత్రలో జరుగలేదన్నారు. విరాట్ కోహ్లీతో సెలెక్షన్ కమిటీ చైర్మన్, తానూ వ్యక్తిగతంగా చర్చించిన తర్వాతే వన్డే ఫార్మాట్ జట్టు సారధిగా కోహ్లీని నియమించాలని నిర్ణయానికి వచ్చామని చెప్పారు.
95 వన్డే మ్యాచ్లకు టీం ఇండియా సారధిగా వ్యవహరించిన కోహ్లీ.. 65 మ్యాచ్ల్లో టీంఇండియా విజయం సాధించగా, 27 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. వన్డే కెప్టెన్గా కోహ్లీ హయాంలో 70.43 శాతం విజయాలు సాధించింది టీం ఇండియా.