న్యూఢిల్లీ: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య వైరం ముగిసినట్లు లేదు. మాజీ బ్యాటర్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) తన తాజా ట్వీట్లో శుభమన్ గిల్ను విశేషంగా మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో.. కోహ్లీ, గిల్లు సెంచరీలతో చెలరేగిపోయారు. ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ .. ఐపీఎల్ల్లో తన ఏడవ సెంచరీ నమోదు చేశాడు. అయితే చేజింగ్లో గిల్ కూడా రెచ్చిపోయాడు. సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ట్వీట్ చేసిన గంగూలీ.. మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కొట్టిన గిల్ను మరీ మరీ ప్రశంసించాడు.
గిల్ ట్యాలెంట్ అద్భుతమని కోహ్లీ తన ట్వీట్లో మెచ్చుకున్నాడు. ఈ దేశం అద్భుతమైన ట్యాలెంట్ను ఉత్పత్తి చేస్తోందని, శుభమన్ గిల్.. వావ్ అని, రెండు హాఫ్స్లోనూ స్టన్నింగ్ ఇన్నింగ్స్ నమోదు అయ్యాయని, టోర్నమెంట్ ప్రమాణాలు అసాధారణంగా ఉన్నాయని గంగూలీ ట్వీట్ చేశాడు. ఈ సీజన్లో ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో గంగూలీ, కోహ్లీలు హ్యాండ్షేక్ ఇచ్చుకోలేదు. గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోహ్లీని పాంటింగ్ కోరాడు. కానీ ఆ ఇద్దరూ షేక్హ్యాండ్ ఇచ్చుకోలేదు.
What talent this country produces .. shubman gill .. wow .. two stunning knocks in two halves .. IPL.. .. what standards in the tournament @bcci
— Sourav Ganguly (@SGanguly99) May 21, 2023