ముషీరాబాద్/చిక్కడపల్లి/కవాడిగూడ, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ జెండాఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అడిక్మెట్ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ జెండా విష్కరించగా, ఆ పార్టీ నాయకులు శ్యాంసుందర్, మాధవ్, సురేందర్, నేత శ్రీనివాస్, బి.శ్రీనివాస్రెడ్డి, సయ్యద్ అస్లాం, టైలర్ శ్రీను, హరీశ్, నాగులు, కిశోర్, హమ్మద్, ఎంఎల్. సత్యనారాయణ, లక్ష్మీపతి, ఖలీల్, శ్రీధర్, రమేశ్ యాదవ్, గురుదీప్, భరత్నర్సింహా, శ్రీకాంత్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ గ్రేటర్ నేత ఎంఎన్ శ్రీనివాసరావు తన ఇంటిపై గులాబీ జెండా ఆవిష్కరించారు. ముషీరాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమాల్లో అహ్మదుల్లా, డి.శివముదిరాజ్, జీ.రాజు, బాల్రాజ్ గౌడ్, బాబురావు, శ్రీధర్ చారి, లక్ష్మణ్ గౌడ్, రజినీ, మల్లేశ్ యాదవ్, నాగులు, బీఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాంనగర్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీ జెండాలను ఎగురవేశారు.
బాగ్లింగంపల్లిలో టీఆర్ఎస్ నాయకులు కిషన్రావు, ఎం.దామోదర్ రెడ్డి, నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోఎమ్మెల్యే ముఠాగోపాల్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ముఠా జైసింహ, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, కూరగాయల శ్రీను, విశ్వనాథ్, భగత్, టీవీ రాజు, మల్లేశ్, కల్యాణ్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రాంనగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షుడు రేషం మల్లేశ్, ఎం.కోటేశ్వర రావు, సిరిగిరి కిరణ్, జైదేవ్, సుధాకర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. గాంధీనగర్ డివిజన్ సహార బేకరీ వద్ద పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్తో కలిసి ఆవిష్కరించారు. పార్టీ నాయకులు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, శ్రీకాంత్, రాజ్కుమార్, శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, నర్సింగ్ రావు పాల్గొన్నారు.
భోలక్పూర్ ఎస్బీఐ కాలనీలో టీఆర్ఎస్ నేత బింగి నవీన్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముఠా జయసింహ, కృష్ణమూర్తి, నవీన్, లక్ష్మణ్, ఆనందరావు పాల్గొన్నారు. రంగానగర్, బడీ మసీద్ ప్రాంతాల్లో మహ్మద్ అలీ, వై. శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలోజెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.