న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్వుమన్ స్మృతి మందాన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నది. మంగళవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు టీకా వేసుకున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను మందాన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.’ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నా. దయచేసి అందరూ సురక్షితంగా ఉండాలని’ స్మృతి ట్వీట్ చేసింది. త్వరలో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో ఏకైక టెస్టులో తలపడనుంది. ఈ టూర్లోనే మూడు వన్డేలు, మూడు టీ20ల్లో ఆడనుంది. త్వరలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న పురుషుల క్రికెటర్లు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు