హైదరాబాద్: ఈ యేటి ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డు స్మృతీ మందానను వరించింది. 2021 సీజన్లో స్మృతీ మందాన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సీజన్లో ఆమె 22 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 38.86 సగటుతో 855 రన్స్ చేసింది. దాంట్లో ఓ సెంచరీ, అయిదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రేచల్ హైవో ఫ్లింట్ ట్రోఫీని స్మృతి చేజిక్కించుకున్నట్లు ఐసీసీ వెల్లడించిఒంది. వాస్తవానికి 2021 సీజన్లో ఇండియా పెద్దగా రాణించలేదు. కానీ స్మృతీ మందాన మాత్రం తన బ్యాట్తో సత్తా చాటింది. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ అందర్నీ ఆకట్టుకున్నది.
దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్లో ఇండియా కేవలం రెండు మ్యాచ్లను మాత్రమే గెలిచింది. ఆ రెండింటిలో మందాన ఇరగదీసింది. భారీ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను విజయ తీరాలకు చేర్చింది. ఓ వన్డే మ్యాచ్లో చేజింగ్లో 80 రన్స్ చేసింది. ఇక ఓ టీ20లో 48 రన్స్ చేసి ఇండియాకు విక్టరీని అందించింది. ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 78 రన్స్ చేసింది. వన్డేల్లో, టీ20ల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడింది.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లోనూ అద్భుత ఫామ్ను ప్రదర్శించింది. రెండవ వన్డేలో 86 రన్స్ చేసింది. ఇక ఒక టెస్టు మ్యాచ్లో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నది. ఆసీస్తో జరిగిన ఓ టీ20లో హాఫ్ సెంచరీ చేసింది. పింక్ బాల్ టెస్టులో సెంచరీ చేసి స్మృతీ రికార్డు క్రియేట్ చేసింది.