లక్నో: ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి 20 ఓవర్లలో ఒక్క వికెట్ చేజార్చుకోకుండా శ్రీలంక పరుగుల వరద పారిస్తోంది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసి జోరు మీదున్నారు. దాంతో 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఒక వికెట్ కూడా నష్టపోకుండా 114 పరుగులు చేసింది.
ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రంగంలోకి దిగిన లంక ఓపెనర్లు నిస్సంక, పెరీరా నిలకడగా ఆడుతూ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. పాతుమ్ నిస్సంక (50; 7 ఫోర్లు), కుశాల్ పెరీరా (54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు.