Indian Cricketers : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్(Test Series)లో కేన్ విలియమ్సన్ (Kane Williamson) శతకాల మోత మోగిస్తున్నాడు. బే ఓవల్(Bay Oval)లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన విలియమ్సన్.. రెండో ఇన్నింగ్స్లోనూ వంద కొట్టాడు. తద్వారా ఒకే టెస్టులో రెండు సెంచరీలు బాదిన ఐదో న్యూజిలాండ్ ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. విలియమ్సన్ కంటే ముందు గ్లెన్ టర్నర్, హోవర్త్, ఆండ్రూ జోన్స్, పీటర్ ఫుల్టన్లు ఈ ఫీట్ సాధించారు. ఇతర జట్లలో కూడా ఒకే టెస్టు శతకాలు బాదిన క్రికెటర్లు చాలామందే ఉన్నారు.
టీమిండియా విషయానికొస్తే.. ఆరుగురు క్రికెటర్లు రెండు ఇన్నింగ్స్ల్లో మూడంకెల స్కోర్ చేశారు. లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) ఏకంగా మూడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) రెండుసార్లు డబుల్ ధమాకా మోగించాడు. విజయ్ హజారే, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రోహిత్ శర్మలు ఒకే టెస్టులో రెండు శతకాలతో ఈ క్లబ్లో స్థానం సంపాదించారు.
విజయ్ హజారే
భారత జట్టు తరఫున ఒకే టెస్టులో రెండు శతకాలు బాదిన రికార్డు మాత్రం విజయ్ హజారే(Vijay Hazare) పేరిట ఉంది. భారత డాన్ బ్రాడ్మన్గా గుర్తింపు పొందిన హజారే 1948లో ఆస్ట్రేలియాతో అడిలైడ్లో జరిగిన టెస్టు తొలి ఇన్నింగ్స్లో 116, రెండో ఇన్నింగ్స్లో 145 రన్స్ కొట్టాడు.
సునీల్ గవాస్కర్
ఆ తర్వాత లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) 1971లో వెస్టిండీస్పై రెండు సెంచరీలు బాదాడు. 1978లో గవాస్కర్ పాకిస్థాన్తో జరిగిన లాహోర్ టెస్టులో, వెస్టిండీస్పై ఈడెన్ గార్డెన్స్లో రెండు ఇన్నింగ్స్ల్సోనూ శతకంతో గర్జించాడు. దాంతో, మూడుసార్లు ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్గా గవాస్కర్ రికార్డు నెలకొల్పాడు.
విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే
రాహుల్ ద్రవిడ్ 199లో మొదటిసారి న్యూజిలాండ్పై రెండు ఇన్నింగ్స్ల్లో వంద కొట్టాడు. హామిల్టన్ టెస్టు (Hamilton Test)లో మొదట 190, ఆ తర్వాత 130 రన్స్ బాదాడు. ఆ తర్వాత 2005లో దాయాది పాకిస్థాన్పై మిస్టర్ డిపెండబుల్ రెండు శతకాలతో విజృంభించాడు. భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా ఈ అరుదైన క్లబ్లో చోటు దక్కించుకున్నాడు. విరాట్ 2014లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ టెస్టులో (115, 141)రెండు సెంచరీలు బాదాడు. అజింక్యా రహానే 2015, రోహిత్ శర్మ 2019లో దక్షిణాఫ్రికాపై రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు కొట్టి వార్తల్లో నిలిచారు.