నేరేడ్మెట్, మార్చి 27: జాతీయ పారా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో శివరాజన్-నిత్యశ్రీ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది. లక్నో వేదికగా జరిగిన టోర్నీ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో శివరాజన్-నిత్యశ్రీ జంట 21-16, 21-19తో కృష్ణ-ఉమ్రేకర్ ద్వయంపై నెగ్గి టైటిల్ చేజిక్కించుకుంది.
సుదర్శన్-రచన జోడీ కాంస్య పతకం గెలుచుకుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న పారా బ్యాడ్మింటన్ క్రీడాకారులు నేషనల్ చాంపియన్షిప్లో పతకాలు కొల్లగొట్టడంతో జాతీయ చీఫ్కోచ్ గోపీచంద్తో పాటు రాజేందర్, ఇర్ఫాన్, అరుంధతి, నిఖిల్ విజేతలను అభినందించారు.