భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీస్ కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో భాగంగా బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్న చైనాకు చెందిన హ్యాన్ యూ పై సింధు విజయం సాధించింది. 62 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రపంచ ఏడో సీడ్ సింధు.. 17-21, 21-11, 21-19 తేడాతో హ్యాన్ యూ ను ఓడించింది.
తొలి సెట్ ఓడినా సింధు పట్టుదలతో ఆడి రెండు, మూడు సెట్లలో హ్యాన్ యూ పై ఆధిపత్యం సాధించింది. మే లో థాయ్లాండ్ ఓపెన్ సెమీస్ కు వెళ్లిన తర్వాత సింధుకు ఇదే తొలి సెమీస్ కావడం గమనార్హం. సెమీస్ లో సింధు.. అన్ సీడెడ్ సయిన కవక్స్మి (జపాన్) ని ఢీకొననుంది.ప్రపంచ 38వ ర్యాంకర్ అయిన కవక్స్మి.. 21-17, 21-19 తేడాతో థాయ్లాండ్ కు చెందిన చోచువాంగ్ ను క్వార్టర్స్ లో ఓడించి సెమీస్ కు దూసుకొచ్చింది.