టోక్యో: వరల్డ్ నంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తై జు-యింగ్. ఈమె చేతిలోనే పీవీ సింధు(PV Sindhu) సెమీఫైనల్ మ్యాచ్లో ఓడింది. అయితే ఫైనల్లో వరల్డ్ నంబర్ 2, చైనా ప్లేయర్ చెన్ యుఫై చేతిలో తై జు.. 18-21, 21-19, 18-21 తేడాతో ఓడిపోయింది. ఇటు బ్రాంజ్ మెడల్ మ్యాచ్ గెలిచిన సింధు.. పోడియంపై తై జుని కలిసింది. ఈ సందర్భంగా తనను ప్రోత్సహిస్తూ సింధు చెప్పిన మాటలు తనను భావోద్వేగానికి గురి చేశాయని తై జు చెప్పింది. సింధు నన్ను హగ్ చేసుకుంది. నువ్వ అనారోగ్యంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. అయినా చాలా బాగా ఆడావు. ఈ రోజు నీది కాదు అని సింధు తనతో చెప్పినట్లు తై జు ఇన్స్టాలో వెల్లడించింది. ఆమె మాటలు నన్ను కాస్త కన్నీళ్లు పెట్టించాయి అని కూడా తై జు చెప్పింది.