న్యూఢిల్లీ: ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. డెన్మార్క్ ఓపెన్లో శుభారంభం చేసింది.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీలో సింధు, ఆకర్షి కశ్యప్ ప్రిక్వార్టర్స్కు చేరగా.. లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే పరాజయాలు ఎదుర్కొని ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మంగళవారం సింధు 21-14, 18-21, 21-10తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)పై గెలిచింది.