బాలీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. వరుస బ్యాడ్మింటన్ టోర్నీల్లో సింధు సెమీఫైనల్ గండాన్ని దాటలేకపోతున్నది. తాజాగా ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి సింధు నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో మూడో సీడ్ సింధు 21-15, 9-21, 14-21తో రెండో సీడ్ రచానోక్ ఇంతానోన్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. తొలి గేమ్లో అద్భుత ప్రదర్శనతో పైచేయి సాధించిన సింధు ఆ తర్వాతి రెండు గేమ్ల్లో ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కోలేకపోయింది. 54 నిమిషాల పాటు పోరాడి ఓటమి వైపు నిలిచింది. పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయానికి భంగపాటు ఎదురైంది. సాత్విక్- చిరాగ్ జోడీ 16-21, 18-21తో టాప్ సీడ్ మార్కస్ ఫెర్నాల్డీ గైడెన్-కెవిన్ సంజయ (ఇండోనేషియా) ద్వయం చేతిలో ఓటమిని చవిచూసింది.