Khelo India | ఢిల్లీ: చేతులు లేకున్నా ఆర్చరీలో సంచలన విజయాలతో పతకాల పంట పండిస్తున్న పారా ఆర్చర్ శీతల్ దేవి శారీరకంగా అన్ని అవయవాలూ సకమ్రంగా ఉండి పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్చర్లతో పోటీపడటమే గాక పతకం కూడా నెగ్గి ఔరా అనిపించింది. ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా ఎన్టీపీసీ నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ మీట్లో పాల్గొన్న శీతల్.. రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది. 17 ఏండ్ల శీతల్.. వ్యక్తిగత కంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో రజతం సాధించింది. జూనియరల్ వరల్డ్ చాంపియన్ ఏక్తా రాణి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది. గతేడాది హాంగ్జౌ వేదికగా ముగిసిన ఆసియా పారా గేమ్స్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం గెలిచిన విషయం తెలిసిందే.