నికోషియా: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ షట్లర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్గా నిలిచాడు. సిప్రస్ రాజధాని నికోషియాలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ టోర్నీలో తరుణ్ 20-22, 21-9, 11-21 తేడాతో డిమిత్రియ్ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు సెమీస్లో 21-14, 21-15తో జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై.. క్వార్టర్స్లో 21-16, 17-21, 21-12తో డెనీలాక్ (పోలాండ్)పై విజయాలు సాధించి ఫైనల్ చేరిన తరుణ్.. తుదిపోరులో తడబడి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.