లక్నో : సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో సిక్కిరెడ్డి-సుమీత్కుమార్ రెడ్డి జోడి ముందంజవేసింది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబు ల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సిక్కిరెడ్డి ద్వయం 21-14, 21-14తో తైవాన్కు చెందిన హువాన్ యి వు-చు యున్పై గెలుపొందారు. మరో మ్యాచ్లో అశ్విని పొన్నప్ప-రోహన్ కపూర్ జోడికూడా 21-12, 21-18తో మలేసియాకు చెందిన పెంగ్ సున్ చన్-యీ సీ చేహ్పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్లో చిరాగ్ సేన్ 21-7, 12-21, 21-17తో రవిపై గెలుపొందాడు. అనంతరం ధృవ్ రావత్తో కలిసి 22-24, 21-13, 21-17తో విమల్రాజ్ అన్నాదురై-నవీన్ ప్రశాంత్ జోడిపై గెలుపొంది రెండో రౌండ్కు చేరుకున్నారు.