వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్, రహానె, విరాట్ కోహ్లీ, పుజారా, ఇషాంత్ శర్మ, బుమ్రా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా తదితరులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా యువ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్ కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నాడు. వ్యాక్సీన్ వేయించుకుంటుండగా తీసిన ఫొటోను గిల్ ట్విటర్లో షేర్ చేశాడు. వీలైనంత త్వరగా మీరు కూడా టీకా తీసుకోవడానికి ప్రయత్నించండి అంటూ గిల్ ట్వీట్ చేశాడు.
జూన్ 18 నుంచి సౌతాంప్టన్లో న్యూజిలాండ్తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ తలపడనుంది. ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో సిరీస్కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.