లండన్: ఇంగ్లండ్తో జరిగే అయిదు టెస్టుల సిరీస్కు ఓపెనర్ శుభమన్ గిల్ దూరం అయ్యాడు. గాయపడ్డ గిల్ను పక్కనపెట్టినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. కానీ ఇంగ్లండ్లో ఇండియా టీమ్తోనే అతను గడపనున్నాడు. గిల్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ను స్టాండ్బైగా తీసుకున్నట్లు. అయితే టెస్టుల్లో ఓపెనింగ్ కోసం మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ కూడా అందుబాటులో ఉంటారు. రోహిత్ శర్మతో కలిసి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపనింగ్ దిగే అవకాశాలు ఉన్నాయి. గిల్ ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడాడు. 31.84 సగటుతో అతను 414 రన్స్ చేశాడు. అతని కెరీర్లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్టాండ్ బై ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు 64 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 43.57 సగటుతో 4401 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్లో ఈశ్వరన్ 13 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. టెంట్ బ్రిడ్జ్లో ఆగస్టు 4వ తేదీ నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభంకానున్నది.