Shubman Gill | భారత జట్టుతో కలిసి యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 14న భారత జట్టు పాకిస్థాన్తో జరుగునున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచ్ అనంతరం భారత జట్టు గుజరాత్లోని అహ్మదాబాద్కు బుధవారం రాత్రి చేరుకున్నది. జట్టుతో కలిసి గిల్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో కనిపించాడు. పాక్తో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. అయితే, జ్వరం కారణంగా ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్తో జరిగిన మ్యాచులకు దూరమైన విషయం తెలిసిందే. మ్యాచ్కు ముందు ఫిట్నెట్ సాధిస్తే బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి బంతికే అవుట్ అయ్యాడు.
రెండో మ్యాచ్లో భారీ స్కోరును సాధించడంలో విఫలమయ్యాడు. ప్రపంచకప్కు ముందు శుభ్మన్ గిల్ డెంగ్యూ బారినపడ్డాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అయితే, పాక్తో జరుగబోయే మ్యాచ్కు ముందు ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉండగా.. ఫిట్నెస్ టెస్ట్లో పాసైతే తర్వాత మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నాడు. వాస్తవానికి డెంగ్యూ నుంచి కోలుకునేందుకు సాధారణంగా వారం వరకు సమయం పడుతుంది. గిల్ ఫిట్నెస్ బాగుండడంతో వేగంగా కోలుకున్నాడు. ఆసియా కప్కు ముందు జరిగిన యో యో టెస్టులో మంచి స్కోర్ను నమోదు చేశాడు. ఇటీవల జరిగిన మ్యాచుల్లో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 20 ఇన్నింగ్స్ల్లో 1,230 పరుగులు చేసి.. సగటు 72.35 ఉండగా.. 105.03 స్ట్రయిక్ రేటు ఉన్నది. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీ సైతం నమోదు చేశాడు.