హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల గిల్ ఆ మ్యాచ్లో వ్యక్తిగతంగా 208 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. డబుల్ సెంచరీతో గిల్ ఐసీసీ ఎలైట్ గ్రూపులో 9వ స్థానంలో నిలిచాడు. వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన 8వ ప్లేయర్గా నిలిచాడతను. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే మూడుసార్లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో చెలరేగాడు. వన్డేల్లో 8 మంది బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేయగా, దాంట్లో అయిదుగురు ఇండియన్లే ఉన్నారు.
Shubman Gill joins an elite group of players 🙌
More records ➡️ https://t.co/d4ufih37VC pic.twitter.com/KSeJtd1IxE
— ICC (@ICC) January 19, 2023
గిల్ ఇప్పటి వరకు వన్డేల్లో మూడు, టెస్టుల్లో ఒక సెంచరీ చేశారు. అంతర్జాతీయ క్రికెట్లో 208 పరుగులే వ్యక్తిగత అత్యధిక స్కోర్. వన్డే కెరీర్లో గిల్ వెయ్యి పరుగుల మైలురాయిని దాటేశాడు. కేవలం 19 మ్యాచుల్లోనే అతను ఆ మైలురాయిని చేరుకున్నాడు. వన్డే చరిత్రలో పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్ ఒక్కడే 18 మ్యాచుల్లో వెయ్యి రన్స్ స్కోర్ చేశాడు.