IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో భారత యువకెరటం శుభ్మన్ గిల్(54 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. రెహాన్ అహ్మద్ (Rehan Ahmed) ఓవర్లో వరుసగా రెండు బౌండరీలతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి టెస్టులో విఫలైమన గిల్.. వైజాగ్ మ్యాచ్లో సాధికారిక ఇన్నింగ్స్తో జట్టును గట్టెక్కించాడు. మూడో వికెట్కు 81 పరుగులు జోడించి భారత్ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
దాంతో, భారత్ 254 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. అయితే.. ఆ తర్వాతి ఓవర్లోనే టామ్ హర్ట్లే బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్(29) ఔటయ్యాడు. బెన్ స్టోక్స్ పరుగెత్తుతూ వెళ్లి డైవింగ్ క్యాచ్ పట్టాడు. దాంతో, ఇండియా 111 రన్స్ వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
He survived a few lbw shouts and edges, and Shubman Gill has made it count #INDvENG
▶️ https://t.co/ZsyelyZUeZ pic.twitter.com/CYqdHN0ifK
— ESPNcricinfo (@ESPNcricinfo) February 4, 2024
తొలి రెండు రోజులు పట్టు బిగించిన భారత్ను మూడో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ అండర్సన్ దెబ్బకొట్టాడు. యశస్వీ జైస్వాల్(), రోహిత్ శర్మ()లను ఔట్ చేసి భారత్ను ఒత్తిడిలోకి నెట్టాడు. సూపర్ డెలివరీతో రోహిత్ను బౌల్డ్ చేసిన జిమ్మీ.. మరుసటి ఓవర్లో డబుల్ సెంచరీ వీరుడు యశస్వీని బోల్తా కొట్టించాడు. దాంతో, భారత్ ఒక్క పరుగు వ్యవధిలోనే ఓపెనర్లను కోల్పోయింది. 35 పరుగులకే 2 వికెట్లు పడిన దశలో గిల్, అయ్యర్లు ఓపికగా ఆడి భారత్కు భారీ ఆధిక్యాన్ని అందించారు.