న్యూఢిల్లీ: దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా, ఇండియా జట్లు వన్డే వరల్డ్కప్ ఫైనల్లో తలపడనున్నాయి. ఆదివారం జరిగే ఆ మహాపోరు గురించి ఇప్పటికే క్రికెట్ ఫీవర్ పీక్ స్టేజ్కు చేరుకున్నది. అయితే ఫైనల్లో ఇండియాను గట్టెక్కించే క్రికెటర్ ఎవర్న దానిపై మాజీ ప్లేయర్ గంభీర్(Gautam Gambhir) ఓ అంచనా వేశారు. మిడిల్ ఆర్డర్లో రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఆసీస్తో జరిగే ఫైనల్ మ్యాచ్లో గేమ్ఛేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు గంభీర అంచనా వేశాడు. స్టార్ స్పోర్ట్స్లో జరిగిన ఓ షోలో మాట్లాడుతూ గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
గాయం వల్ల కొన్నాళ్లు జాతీయ జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్.. వరల్డ్కప్ సమయంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక కీలకమైన మ్యాచుల్లో అద్భుతంగా రాణించాడు. సెమీస్లో అతను 70 బంతుల్లోనే సెంచరీ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్లో మ్యాక్స్వెల్, జంపా బౌలింగ్ చేస్తున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ కీలక ప్లేయర్ కానున్నట్లు గంభీర్ చెప్పాడు. ఐసీసీ వరల్డ్కప్ మ్యాచ్ల్లో మిడిల్ ఆర్డర్లో వచ్చి అత్యధిక రన్స్ కొట్టిన బ్యాటర్గా శ్రేయార్ అయ్యర్ నిలిచారు. మిడిల్ ఆర్డర్లో ఆడి 500 రన్స్ కొట్టిన తొలి బ్యాటర్గా శ్రేయాస్ నిలిచాడు.
టోర్నీలో ఇప్పటి వరకు శ్రేయాస్ 526 రన్స్ చేశాడు. 75.14 సగటుతో అతను స్కోరింగ్ చేశాడు. ఇక స్ట్రయిక్ రేటు 113గా ఉంది. రెండు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. అతని బెస్ట్ స్కోర్ 128.