ప్రస్తుతం సూపర్ ఫామ్లో టీమిండియా ప్లేయర్ అనగానే గుర్తొచ్చే పేరు శ్రేయాస్ అయ్యర్. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్లో అయ్యర్ విజృంభించాడు. మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్గా కూడా నిలిచాడు. ఈ క్రమంలో తాజాగా ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీ20 క్రికెట్పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
పొట్టి ఫార్మాట్లో డాట్ బాల్స్ ఆడటం తన దృష్టిలో పెద్ద నేరమని చెప్పాడు. ప్రతి డాట్ బాల్ బ్యాటర్ను మరింత ఒత్తిడిలోకి నెడుతుందని చెప్పాడు. అలాగే ఆటగాళ్లకు ‘ఇంటెంట్’ చాలా ముఖ్యమని, ప్రతి బంతికి పరుగులు చేయాలనే కసితో ఉండాలని అన్నాడు. అలాగే శ్రీలంక సిరీస్లో తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించాడు.
‘‘చాలా సంతోషంగా ఉంది. నాకు సిరీస్లో అద్భుతమైన ఆరంభం లభించింది. బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉంది. అందుకే పూర్తి స్వేచ్ఛతో బ్యాటింగ్ చేశా. కొన్ని పరుగులు తక్కువ చేసినా కూడా ఆ ఇంటెంట్ మాత్రం ఎప్పుడూ పాజిటివ్గా ఉండేలా చూసుకోవడమే ముఖ్యం’’ అని వివరించాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో దిగిన అయ్యర్ సూపర్ ఇన్నింగ్సులు ఆడాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లోనే ఉండటంతో వీరిద్దరిలో ఎవరికి జట్టులో స్థానం దక్కుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.