Shreyas Iyer : ఐపీఎల్ 19వ సీజన్కు సమయం దగ్గరపడడంతో కొత్త జెర్సీలతో ఫ్రాంచైజీలు సందడి చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే జెర్సీలను విడుదల చేయగా.. పంజాబ్ కింగ్స్ సైతం తమ జెర్సీని పరిచయం చేసింది. శుక్రవారం జరిగిన వేడుకలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), ఫ్రాంచైజీ యాజమాన్యం విడుదల చేసింది. ఈ సందర్భంగా సారథి అయ్యర్ మాట్లాడుతూ తన కన్ను ట్రోఫీపైనే ఉందని వెల్లడించాడు.
గతేడాది ట్రోఫీకి అడుగు దూరంలో ఆగిపోయిన పంజాబ్ కింగ్స్ ఈసారి టైటిల్పై కన్నేసింది. ఈ విషయాన్ని కొత్త జెర్సీ విడుదల సందర్భంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ‘మాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. నాకు సవాళ్లంటే ఇష్టం. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. మేము మైదానంలోకి దిగిన ప్రతిసారి గెలవాలనుకుంటాం. ఈసారి నా కన్ను ట్రోఫీపైనే ఉంది’ అని అయ్యర్ పేర్కొన్నాడు.
Chandigarh: Ahead of IPL 2026, Punjab Kings skipper Shreyas Iyer says, “We had a fantastic season, as everyone knows, and you have been reiterating the same lines. But it’s important that we stay in the present—this is a new season and a fresh start…” pic.twitter.com/3jFEgw5X7U
— IANS (@ians_india) March 20, 2026
ఫ్రాంచైజీ యాజమాన్యం,పేసర్ అర్ష్దీప్ సింగ్తో కలిసి అయ్యర్ కొత్త జెర్సీని ఆవిష్కరించాడు. నిరుడు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్తో సరిపెట్టుకుంది.