Shreyas Iyer : భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) కీలక పోరులో ఫామ్ చాటుకున్నాడు. ఈ స్టైలిష్ బ్యాటర్ ముంబైలోని వాంఖడేలో గురువారం శ్రీలంకపై సూపర్ ఫిఫ్టీతో విమర్శకుల నోళ్లు మూయించాడు. జట్టుకు భారీ స్కోర్ అందించడమే కాకుండా ఫీల్డింగ్లోనూ మెరిశాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్.. ‘షార్ట్పిచ్ బంతులు ఆడేందుకు ఇబ్బందిపడుతున్నారు కదా?’ అని ప్రశ్నించడంతో అయ్యర్కు చిర్రెత్తుకొచ్చింది.
కోపం పట్టలేకపోయిన అతడు.. ‘షార్ట్పిచ్ బంతుల్ని ఎదుర్కోలేనని అంటున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటీ? నేను ఎన్ని ఫుల్షాట్స్కు పరుగులు చేశానో, బౌండ్రీలు బాదానో నువ్వు చూశావా’ అని మారు ప్రశ్నించాడు. దాంతో సదరు రిపోర్టర్ ఏం మాట్లాడాలో తెలియక బిక్కమొఖం వేశాడు.
వరల్డ్ కప్లో పాకిస్థాన్పై అర్ధ సెంచరీ మినహా.. మిగతా మ్యాచుల్లో అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఒకదశలో అతడిని పక్కన పెట్టాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో అయ్యర్ లంకపై తన బ్యాట్ పవర్ చూపించాడు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు.
దాంతో, భారత్ 8 వికెట్ల నష్టానికి 357 రన్స్చేయగా.. లక్ష్య ఛేదనలో లంక కనీస పోరాటం చేయలేకపోయింది. షమీ, సిరాజ్ విజృంభించడంతో 55 పరుగులకే ఆలౌటయ్యింది. దాంతో, భారత్ 302 పరుగుల తేడాతో భారీ విజయం గెలుపొంది సెమీస్లో కాలుమోపింది.