INDvsENG : భారత మహిళా క్రికెట్ జట్టు యువ ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ స్పిన్ మ్యాజిక్తో ఇంగ్లండ్-ఏ తో ముగిసిన తొలి మ్యాచ్లో భారత్-ఎ సూపర్ విక్టరీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 135 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా శ్రేయాంక బౌలింగ్ మాయతో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో విజయానికి దూరమైంది. ఆఖరి ఓవర్లో పొదుపుగా బౌలింగ్ చేయడమే గాక రెండు వికెట్లు కూడా తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఆమెనే వరించింది.
ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో మిన్ను మణి సారథ్యంలో బరిలోకి దిగిన భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డి. వృంద (22), డి.డి. కసత్ (25), దివ్య (22)లు రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. హోలి అర్మిటెజ్ (41 బంతుల్లో 52, 3 ఫోర్లు, 1 సిక్స్), సెరెన్ (31)లు రాణించడంతో విజయం దిశగా దూసుకుపోయింది.
The match went down to the final ball & it’s India ‘A’ who win the 1st T20 by 3 runs 🙌
Scorecard ▶️ https://t.co/Vzuyka46BL…#INDAvENGA | @IDFCFIRSTBank pic.twitter.com/VgLiKhzpYr
— BCCI Women (@BCCIWomen) November 29, 2023
కానీ అర్మిటెజ్ను 17వ ఓవర్లో మిన్ను మణి ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ మరుసటి ఓవర్లోనే సెరెన్ ను కాశ్వీ గౌతమ్ను ఔట్ చేసింది. సెరెన్ నిష్క్రమించే సమయానికి ఇంగ్లండ్ 17.4 ఓవర్లలో 114 పరుగులు చేసింది. అదే ఓవర్లో ఇస్సీ వాంగ్ కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాలు రెట్టింపయ్యాయి. కానీ కెప్టెన్ చార్లీ డీన్ (10) క్రీజులో ఉండటంతో ఆ జట్టు విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో ఆఖరి ఓవర్ వేసిన శ్రేయాంక మాయ చేసింది. తొలి నాలుగు బంతుల్లో 9 పరుగులిచ్చిన శ్రేయాంక.. తర్వాత వరుస బంతుల్లో రియానా మాక్డొనాల్డ్, చార్లీ డీన్ను ఔట్ చేయడంతో ఇంగ్లండ్కు షాక్ తప్పలేదు.