భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే గతేడాది ఓపెనర్గా అత్యంత పేలవ ఫామ్ ప్రదర్శించిన కోహ్లీ.. ఈసారి కూడా ఓపెనింగ్ చేస్తాడా? అనే ప్రశ్నకు మాజీ దిగ్గజాలు సమాధానం చెప్తున్నారు. ఐపీఎల్లో కోహ్లీ తనకు అచ్చొచ్చిన మూడో స్థానంలో కన్నా.. ఓపెనర్గానే రాణించాడు.
ఓపెనర్గా 136.88 స్ట్రైక్ రేట్, 43.65 సగటుతో 2750 పరుగులు చేశాడు. అదే సమయంలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 123.84 స్ట్రైక్ రేట్, 36.93 సగటుతో 2696 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ప్రస్తుతం జట్టులో డివిల్లీర్స్ లేడని, ఆ స్థానాన్ని కేవలం దినేష్ కార్తీక్ పూడ్చలేడని మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాబట్టి కోహ్లీ మూడో స్థానంలో వచ్చి ఆ బాధ్యతను పంచుకోవాలని సూచించాడు.
అదే సమయంలో మరో మాజీ దిగ్గజం వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లీ ఓపెనర్గా వచ్చినప్పుడు క్రీజును ఉపయోగించుకుంటూ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది అతని సహజమైన ఆట కాదు. దానికితోడు ఆర్సీబీ కొత్త కెప్టెన్ డుప్లెసిస్ కూడా అలాగే ఆడతాడు. వాళ్లిద్దరూ ఒకేలా ఆడుతూ ఓపెనింగ్ చేస్తే పెద్దగా ఫలితం ఉంటుందని నేను అనుకోవడం లేదు. దానికన్నా యువ ఆటగాడు అనూజ్ రావత్ను ఓపెనర్గా పంపించి, కోహ్లీ మూడో స్థానంలో వచ్చి తన సహజమైన ఆట ఆడితే మంచిందని నా అభిప్రాయం’’ అని చెప్పాడు. ఈ నెల 27న ఆర్సీబీ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్లో కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడో లేక మూడో స్థానంలో ఆడతాడో చూడాలి.