న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు ఆఖరి అర్హత టోర్నీ అయిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో బరిలోకి దిగే ప్లేయర్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా కేరళ సీఎం విజయన్ను దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష కోరింది. పటియాల వేదికగా ఈనెల 25 నుంచి 29 వరకు జరిగే జాతీయ టోర్నీతో పాటు విశ్వక్రీడలకు అర్హత సాధించిన వారిని వ్యాక్సినేషన్లో భాగం చేయాల్సిందిగా ఉష సూచించింది. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ ద్వారా ఉష విజ్ఞప్తి చేసింది.