జకార్తా: ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత పతక జోరు దిగ్విజయంగా సాగుతున్నది. బుధవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్రైఫిల్ ఫైనల్లో నాన్సీ 252.8 పాయింట్లతో పసిడి పతకంతో మెరువగా, భారత్కే చెందిన ఇలావెనిల్ వాలరివన్(252.7) రజతం ఖాతాలో వేసుకుంది.
ఇదే విభాగంలో మొహులీ ఘోష్ (210) నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్ 228.7 స్కోరుతో కాంస్యం దక్కించుకున్నాడు.