హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్పెయిన్ వేదికగా సెప్టెంబర్ 17 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచ సెయిలింగ్ టోర్నీకి రాష్ర్టానికి చెందిన శ్లోకా మహేశ్ ఎంపికైంది. జే80 విభాగంలో భారత్ తరఫున శ్లోక బరిలోకి దిగనుంది.
ఇటీవల చెన్నైలో జరిగిన జాతీయ సెయిలింగ్ చాంపియన్షిప్లో శ్లోక రజత పతకంతో మెరిసింది. 40 మంది సెయిలర్లు పోటీపడ్డ టోర్నీలో ఈ 16 ఏండ్ల యువ సెయిలర్ సత్తాచాటింది.