Shivam Dube | హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సలహాలు, సూచనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు యువ ఆల్రౌండర్ శివమ్ దూబే పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన 16వ సీజన్ ఐపీఎల్లో చెన్నై విజేతగా నిలువడంలో దూబే కీలకంగా వ్యవహరించాడు. కీలకమైన మిడిలార్డర్లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విజయాలందించాడు. ‘పరిమ్యాచ్ స్పోర్ట్స్’కు బ్రాండ్మాస్టర్గా ఎంపికైన దూబే గురువారం హైదరాబాద్కు విచ్చేశాడు.
ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ ‘గత ఐపీఎల్ సీజన్ అద్భుతంగా సాగింది. చెన్నై జట్టుతో ఈ సీజన్ మరిచిపోని అనుభూతిని మిగిల్చింది. మేనేజ్మెంట్, సహాయక బృందం మద్దతుతో నేను ఈ స్థాయిలో రాణించగలిగాను. ఫలితంపై దృష్టి పెట్టకుండా ధోనీ ఇచ్చిన సలహాలతో ముందుకు సాగాను. ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా ధోనీ లాగా ఉండేందుకు చాలా వరకు ప్రయత్నిస్తున్నా. ఎప్పటికైనా తిరిగి భారత జట్టుకు ఆడాలన్నదే నా కల’ అని అన్నాడు.