హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరల్డ్ పవర్లిఫ్టింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చాంపియన్షిప్లో శిల్ప స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా జరిగిన పోటీల్లో మహిళల మాస్టర్-1 కేటగిరీలో బరిలోకి దిగిన శిల్ప డెడ్ లిఫ్ట్లో 105 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. అండర్ 90 విభాగంలో శిల్ప పసిడి గెలుచుకోగా.. 100 కేజీల బరువెత్తిన ఇందు రజత పతకం చేజిక్కించుకుంది. ఇతర పోటీల్లో అండర్ 70 కేటగిరీలో మన రాష్ర్టానికి చెందిన అర్షియా (125 కేజీలు), సౌమ్య (115 కేజీలు) వరుసగా స్వర్ణ, రజతాలు ఖాతాలో వేసుకున్నారు.