ICC Under-19 Women’s World Cup | ఐసీసీ అండర్-19 వుమెన్స్ వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియాకు కెప్టెన్గా స్టార్ బ్యాట్ వుమెన్ షఫాలీ వర్మ ఎంపికైంది. అండర్ -19 మహిళల ప్రపంచ కప్తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించిందని బీసీసీఐ తెలిపింది. ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ తొలి ఎడిషన్లో 16 జట్లు పాల్గొనున్నాయి. 2023 జనవరి 14 నుంచి 29 వరకు దక్షిణాఫ్రికాలో మెగా టోర్నీ జరుగనున్నది. దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు స్కాట్లాండ్తో కలిసి భారత్ గ్రూప్-డీలో కొనసాగుతున్నది. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ రౌండ్కు చేరుతాయి.
సూపర్ సిక్స్లో ఆరు గ్రూప్లు ఉండగా… ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్కు చేరుకుంటాయి. జనవరి 27న పొట్చెఫ్స్ట్రూమ్లోని జేబీ మార్క్స్ ఓవల్ మైదానంలో జరుగనుండగా.. ఫైల్ మ్యాచ్ను జనవరి 29న అదే మైదానంలో నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. షఫాలీ వర్మ భారత వుమెన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నది. ఇటీవల బ్యాట్తో రాణిస్తున్నది. షెఫాలీతో పాటు, రిషా ఘోష్ సైతం భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. జాతీయ జట్టుకు ఆడిన వీరిద్దరి అనుభం జట్టులోని మిగతా క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడనున్నది. మహిళల అండర్-19 ప్రపంచకప్ను నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి. మహిళల క్రికెట్ను ప్రోత్సహించేందుకు ఐసీసీ మెగా టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది.
షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లీ గాలా, హర్షిత బసు (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్శ్వి దేవి, పార్శ్వి టిటా సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ ఎండీ, శిఖా, నజ్లా సీఎంసీ, యశ్శ్రీని ఎంపిక చేసింది. ఇందులో శిఖా, నజ్లా సీఎంసీ, యశశ్రీ రిజర్వు ప్లేయర్లు.