RCB vs MI : మమిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు షఫాలీ వర్మ (54), మేగ్ లానింగ్ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ఈ డాషింగ్ ఓపెనర్ 32 బంతుల్లో ఫిఫ్టీ బాదింది. ఈ లీగ్లో రెండో అర్ధ శతకం నమోదు చేసింది. మేగ్ లానింగ్తో కలిసి వేగంగా పరుగులు రాబట్టింది. వీళ్లిద్దరూ తొలి వికెట్కు 105 పరుగులు జోడించారు.పది ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 105 రన్స్ చేసింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబైలోని బ్రబౌర్నే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 143 రన్స్ తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 207 రన్స్ చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ (65) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడింది. అమేలియా (45), మ్యాథ్యూస్ (47) దూకుడుగా ఆడడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది.