హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్కూల్ చెస్ టోర్నీకి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి జీ శరిష్మా అర్హత సాధించింది. ఏప్రిల్ 13 నుంచి 23 వరకు గ్రీస్ వేదికగా జరిగే మెగాటోర్నీలో శరిష్మా..భారత్ తరఫున బరిలోకి దిగనుంది.
మహబూబాబాద్ చెస్ అకాడమీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న శరిష్మా అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నది. ఇటీవల జరిగిన 11వ జాతీయ స్కూల్ చెస్ చాంపియన్షిప్లో 4.5 పాయింట్లతో 19వ స్థానంలో నిలువడం ద్వారా శరిష్మా.. ప్రపంచ టోర్నీకి బెర్తు దక్కించుకుంది. ఇప్పటికే ఆకాశ్ వరల్డ్ చెస్ చాంపియన్షిప్నకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.