న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంకా కోలుకోకపోవడంతో.. దక్షిణాఫ్రికాతో సిరీస్కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి తీసుకున్న ఉమేశ్ యాదవ్.. సఫారీలతో సిరీస్కు కూడా టీమ్లో కొనసాగనున్నాడు. పశ్చిమబెంగాల్కు చెందిన లెఫ్టార్మ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్కు టీ20 జట్టులో చోటు దక్కగా.. గాయం కారణంగా దీపక్ హుడా కూడా దూరమయ్యాడు.
దీంతో మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు అవకాశం దక్కింది. ‘షమీ పూర్తిగా కోలుకోలేదు. అతడికి ఇంకా సమయం కావాలి. అందుకే సిరీస్కు దూరమయ్యాడు. ఉమేశ్ జట్టుతో కొనసాగుతాడు. అక్షర్కు విశ్రాంతినివ్వాలనుకుంటే షాబాజ్ను వినియోగించుకోవచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం తిరువనంతపురంలో తొలి టీ20 జరుగనుంది.