కొలంబో: ఇండియాతో జరిగిన ఆసియాకప్ వన్డే మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లు(Pakistan Bowlers) హరిశ్ రౌఫ్, నసీమ్ షా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరి స్థానంలో పాక్ జట్టు బ్యాకప్ బౌలర్లను తీసుకున్నది. షహనవాజ్ దహాని, జమాన్ ఖాన్లను బ్యాకప్ బౌలర్లుగా తీసుకున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ వెల్లడించింది. ఐసీసీ వన్డే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ బోర్డు తెలిపింది. ఇక ఆసియా కప్ సమయంలోనే హరిశ్, నసీమ్లను మెడికల్ బృందం పర్యవేక్షించనున్నది. ఒకవేళ మరో వారం పాటు నసీమ్, హరిశ్ ఆటకు దూరం అయితే, అప్పుడు ఆసియన్ క్రికెట్ మండలి సహకారంతో ఇద్దరు కొత్త బౌలర్లను మైదానంలోకి దించనున్నట్లు పాక్ క్రికెట్ తెలిపింది. నసీమ్ వేలికి గాయం కాగా, రౌఫ్ ఛాతి కండరాల్లో వాపు వచ్చింది. ఆ ఇద్దరూ ఇండియాతో బ్యాటింగ్ చేయలేదు.