న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లు షారుఖ్ఖాన్, సాయి కిశోర్కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న సిరీస్లలో వీరిద్దరిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికార వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున షారుఖ్, కిషోర్ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ‘వెస్టిండీస్తో టీ20, వన్డే సిరీస్ల కోసం షారుఖ్, కిషోర్ను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశాం. ప్రధాన జట్టుతో పాటు వీరు త్వరలోనే బయోబబుల్లో చేరుతారు’ అని బోర్డు తెలిపింది. ఫిబ్రవరి 6 నుంచి అహ్మదాబాద్ వేదికగా విండీస్తో వన్డే సిరీస్, కోల్కతాలో 16 నుంచి టీ20 సిరీస్ జరుగనుంది. ఇందులో ఎవరైనా ప్లేయర్ గాయపడితే వారి స్థానంలో బరిలోకి దింపే అవకాశముంది.