ఆస్ట్రేలియా వేదికగా జరిగే విమెన్స్ బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో భారత్ నుంచి మరో ఇద్దరు క్రికెటర్లు లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. టీనేజ్ సంచలనం షెఫాలీ వర్మ రాబోయే సీజన్లో సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలో దిగనుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ కూడా బీబీఎల్లో సిడ్నీ ఫ్రాంఛైజీ తరఫును ఆడటానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
షెఫాలీతో పాటు రాధా ఈ సీజన్లో లీగ్లో పాల్గొంటారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(సిడ్నీ థండర్), స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(బ్రిస్బేన్ హీట్), ఆల్రౌండర్ వేద కృష్ణమూర్తి(హోబార్ట్ హరికేన్స్ ) ఇప్పటికే బీబీఎల్లో ఆడుతున్నారు.