దుబాయ్: భారత యువ సంచలనం షెఫాలీ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మంగళవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో 726 పాయింట్లతో షెఫాలీ నంబర్వన్ ర్యాంక్కు చేరుకోగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందన నాలుగో ర్యాంక్కు పడిపోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు బెత్ మూనీ, మెగ్ లానింగ్ రెండు, మూడు ర్యాంక్ల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి దీప్తిశర్మ నాలుగో ర్యాంక్కు ఎగబాకగా.. ఆల్రౌండర్ విభాగంలో మూడో స్థానానికి చేరింది.