న్యూఢిల్లీ: క్రీడలను అందరికీ చేరువ చేసే సదుద్దేశంతో స్పోర్ట్స్ ఫర్ ఆల్(ఎస్ఎఫ్ఏ) మరో ప్రయత్నంతో ముందుకు వచ్చింది. రానున్న ఐదేండ్లకు గాను ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్(కైఐవైజీ)కు ఎస్ఎఫ్ఏ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఎస్ఎఫ్ఏ ఐదేండ్ల కాలానికి రూ.12.5 కోట్లు ఖర్చు చేయనుంది.
‘దేశంలో క్రీడలను క్షేత్ర స్థాయి నుంచి మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. సరికొత్త టెక్నాలజీ సహయంతో అందరికీ క్రీడలను అందుబాటులో తీసుకొస్తాం. ’ అని రిశికేశ్ జోషి పేర్కొన్నాడు.