పుణె : మార్చి 25నుంచి 28వ తేదీవరకు పుణెలో జరుగనున్న 33వ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో ఒలింపియన్ భవానీ దేవి ప్రధాన ఆకర్షణ కానున్నది.
జాతీయ ఫెన్సింగ్ సంఘం, మహారాష్ట్ర ఫెన్సింగ్ సంఘం, డివై పాటిల్ అంతర్జాతీయ వర్సిటీ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. ఈ చాంపియన్షిప్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 700మందికి పైగా ఫెన్సర్లు పాల్గొననున్నారు.