హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందేందుకు డిసెంబర్ 1 నుంచి ఎంపికలు నిర్వహిస్తున్నట్టు క్రీడా మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. 14 నుంచి 18 ఏండ్ల లోపు వారు ఇందులో పాల్గొనవచ్చని.. జాతీయ, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులను తయారు చేసేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్లేయర్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ అత్యుత్తమ స్థాయికి ఎదిగారని, ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపికైనట్టు మంత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.